Setti Balija

Setti Balija అసలు ఎవరీ శెట్టిబలిజలు? బలిజలకు శెట్టిబలిజలకు ఏదైనా సంబంధం ఉందా? శెట్టిబలిజల చరిత్ర ఏంటి? Kapu Community.

Setti Balija

అసలు ఎవరీ శెట్టిబలిజలు?

పూర్వము బలిజలు సముద్ర ప్రాంతము నుండి ఉప్పు గోనె సంచులలో వేసి జంతువులపై తెచ్చి సంతలలో విక్రయించేవారు శెట్టిబలిజలని పిలవబడ్డారు. వీరు కేవలం వర్తకులుగానున్నారు. రాయలసీమ, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఈ శెట్టి బలిజలు గలరు. వీరు సాంఘికంగా, ఆర్ధికంగా, నైతికంగా, రాజకీయంగా ఉచ్చస్థితిలో వున్నారు.

తూర్పుగోదావరి - పశ్చిమగోదావరి జిల్లాల్లో కల్లు గీయువారుకూడ 1920సఁ॥ నుండి ఇప్పటివరకు శెట్టిబలిజలు అని పిలవ బడుచున్నారు. పూర్వము ఈ సంఘీయులు “ఈడిగలు” 'శెట్టి కులస్తులు" అని పిలవబడ్డారు. తదితర జిల్లాల్లో అనగా శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలో సెగిడీలు అని, ఏత వారని, కృష్ణా జిల్లాలో ఈడిగ అని, కర్నూలు, బళ్ళారి, గుంటూరు, హైదరాబాదు మొదలగు జిల్లాలో గౌడ గవండ్ల అని పిలిచేవారు.

పైన ఉదహరించిన శెట్టిబలిజలకు - ఉభయ గోదావరి జిల్లాల్లో పిలవబడుచున్న శెట్టిబలిజలకు (కల్లుగీత వారికీ) ఎటువంటి సంబంధము లేదు. ఆ బలిజశాఖకు చెందినవారు ఈ సంఘీయులు కారు. కాబట్టి; ఈ రెండు శాఖలు కలవడానికి గాని ఒక్కటే అని చెప్పుకోడానికి గాని అవకాశము లేదు. ఈ విషయము అమలాపురం వాస్తవ్యులగు శ్రీకుడుపూడి చిన్నయ్యగారు, శ్రీకాండ్రేగులు సూర్యనారాయణ డాక్టరు గారు మొదలగువారు తెలియజేసిరి.

ఈ కులమువారిని శెట్టిబలిజలని పిలవటానికి కారణం అధిక సంఖ్యాకులు విద్యా, ధనములకు వెనుక బడుటవలనను, సాంఘికంగా, రాజకీయంగా పలుకుబడి లేక పోవుటవలనను, “‘ఈడిగాళ్ళు” ‘'శెట్టిగాళ్ళు'' అని ఆమర్యాదగా ఈ సంఘీయులు పిలువబడ్డారు.
ఈ శద్దోచ్చారణ విద్యా, ధనములుగలిగి గౌరవముగా జీవించు స్వజాతీయులకు చాలా బాధాకరముగా వుంటూ వచ్చినది. అందువలన సహించరాని ఈ అనాగరికపదము తొలిగించి ఆధునిక భావార్థమునకు సరిపడు విధముగా కులముపేరు మార్పుచేసి జాతీయుల ఆత్మగౌరవమును పెంపొందింపచేసి అభివృద్ధికి తీసుకురావాలని సంపన్న కుటుంబీకులైన అల్లవరం తాలూకా బోడసకుర్రు గ్రామస్థులు పూజనీయులు కీ॥ శే॥ శ్రీమ్మేటి వెంకట రెడ్డిగారు, శ్రీ వెంకటస్వామిగారు, శ్రీపిల్లి సుబ్బారావుగారు, శ్రీ గుబ్బల రామన్నగారు, శ్రీ కుడుపూడి సూర్య నారాయణగారు, కొత్తూరు గ్రామకాపురస్తులు శ్రీ గుత్తులు నాగయ్యగారు, శ్రీ గుత్తులు సూర్యనారాయణగారు, శ్రీ సీతము శెట్టి వెంకన్న గారు, శ్రీ గుబ్బల వేములు గారు మొదలగువారు ఆలోచించి ఒక నిర్నయమునకు వచ్చిరి,

బ్రిటీష్ పరిపాలన కాలములో వీరు రంగూన్ నగరము (బర్మా) లో నివసిస్తూ రంగూన్ రేవుకు చేరె కార్లో ఓడలు నుండి సరకులు దిగుమతి ఎగుమతి చేయుటకు ఆయా ఓడల కంపెనీల అధికారులు యొక్క ఆర్డరులు పుచ్చుకొని పెద్ద పడవలు, కార్మికులను సరఫరా చేసి లక్షలు సంపాదించి బర్మా ఆంధ్రులలో పేరుతెచ్చుకున్నారు. సంపాదనలో శ్రీదొమ్మేటి వెంకట రెడ్డిగారి దే పై చెయ్యి. పలుకుబడిలో శ్రీదొమ్మేటి వెంకటస్వామిగారే. వీరు రంగూన్ కార్పొరేషన్ చైర్మన్ గాను, బర్మా శాసన సభకు M.L. C. గాను ఎన్నుకోబడ్డారు. శ్రీ వెంకటస్వామిగారు అటు ఆంగ్లేయులు దయ సంపాదించి, యిటు బర్మాఆంధ్రులచే గౌరవింపబడ్డారు. శ్రీ డి. వి రెడ్డి అండు బ్రదర్సు కంపెని అంటే బర్మాలో తెలియని ఆంధ్రుడుండడు. బర్మాలో కలిగిన పేరు ప్రతిష్టలు మాతృభూమి యందు కూడ లభించాలంటే తమతో పాటు జాతిని ముందుకు తీసుకువచ్చి సాంఘికంగా గౌరవప్రతిష్టలు సంపాదించి పెట్టాలని సంకల్పించుకున్నారు. ఈసంకల్పబలము వలననే మిగిలి సోదర జాతీయులందరిని కూడగలుపుకొని 1918వ సం॥న రంగూన్ నగరములో సమావేశమై చర్చలు జరిపారు. జాతిని నీచముగా, హీనముగా పిలవడం సహించరానిది. గనుక అందుకు తగు విధముగా కులముపేరు మార్పు చేసి ఒక సంఘమును స్థాపించి జాతిని అభివృద్ధికి తీసుకురావాలని నిర్ణయించారు.

ఆంధ్ర దేశమంతట వివిధవర్తక సంబంధమైన వృత్తిని కలిగియున్న వారందరు భిన్నభిన్న నామములుతో బలిజలని పిలవబడు చున్నారు. బహుశా బలిజశబ్దం వర్తకునియొక్క పర్యాయపదమై వుండాలి. అందువల్ల చాలామంది వృత్తి నామము వెనుక బలిజశబ్దము చేర్చుకొని పిలవబడుచున్నారు. చెట్లనుండి కల్లుతీసి విక్రయించుట కూడ వర్తక సంబంధమైన వృత్తి కాదని యెవరు అనలేదు. కాబట్టి (చెట్టీ) శెట్టిగాళ్ళు అను నాలుగక్షరములలో "శెట్టి" అను రెండక్షరములు యధా తధంగా వుండనిచ్చి "గాళ్ళు" అను రెండక్షరములు తొలిగించి వాటిస్థానములో బలిజ అనే మూడక్షరములు చేర్చి "శెట్టిబలిజ" అని జాతిని పిలవడం సగౌరవముగా ఉంటుందని భావించి 1980 సం॥లో జరిగిన మహాసభలో ఏకగ్రీవముగా తీర్మానించిరి. ఈ సవరణను ఆంధ్రదేశములోనేగాక బర్మా లోని జాతీయులందరు ముక్త కంఠములో బలపర్చారు. ఈ ‘శెట్టిబలిజ" అనే సవరణను జిల్లా సంఘీయులలో వ్యాప్తి చేయటానికి బోడసకుర్రులో 1920 సం॥లో కేంద్ర శెట్టిబలిజ సంఘమును స్థాపించారు. ఈ సంఘమును విజయవంతముగా నడుపుటకును, తన్ములముగా కులములో ఉన్న బీద బాలబాలికలకు విద్యాభివృద్ధి కలుగజేసి జీవనోపాధి మార్గములు చూపించడం మొదలగు సంఘాభివృద్ధి కార్యములు కొనసాగుటకుగాను. బర్మాలో వసూలు చేసిన రూ.50,000/- మూలధనముకు ఈ సంఘపరం చేయడమైనది. తదుపరి ఈ సంఘనాయకులు కృషి, పట్టుదల వలన 1920లో ప్రభుత్వ రికార్డులలో శెట్టిగాళ్ళు అను పదమునకు బదులు “శెట్టిబలిజ” అని రిజిస్టరు చేయించారు. అందువల్ల నాటినుండి నేటివరకు ఈసంఘీయులను శెట్టిబలిజలని ఉభయ గోదావరి జిల్లాల్లో గౌరవముగా పిలవడం వాడుకలోనికి వచ్చినదని తెలుస్తుంది. వీరి నామాంతమున కొందరు శెట్టి అనే పదమును చేర్చుకొని సగౌరవంగా పిలవబడుతున్నారు. కానీ బలిజలకు శెట్టి బలిజలకు ఎటువంటి సంబంధము లేదు. వీరు బలిజ కాపు వర్గానికి చెందిన వారు కాదు.

Gajula Balija | Munnuru Kapu | Kapu History | Kapu community