Naidu Gari Samsthanam

Naidu gari Samsthanam నాయడుగార్ల సంస్థానము. శ్రీ చంద్ర వంశీయ ఆంధ్ర క్షత్రియులకు మొదట రాజ, మహా రాజ, విజయ, సేన, విక్రమ, భోజ, పాల, భువన, సింహ...

Naidu Gari Samsthanam

నాయడుగార్ల సంస్థానము.

శ్రీ చంద్ర వంశీయ ఆంధ్ర క్షత్రియులకు మొదట రాజ, మహా రాజ, విజయ, సేన, విక్రమ, భోజ, పాల, భువన, సింహ, చాళుక్య, వర్మ, వల్లభ, వర్ధన, మల్ల, కాలచూర్య, నాయక, గణపతి, గజపతి, నరపతి, రాయ, అనే మొదలగు పేర్లు ఉండేవి. ఆమీద నాయుడు అను పేరు వచ్చింది. ఆంధ్ర క్షత్రియులు మగధము, ఉజ్జయినీ మొదలగు దేశాల దగ్గరనుండి రాజ్యము చేయు కాలమున సంస్కృత నామములు ఉంచుకున్నారు. దక్షిణ దేశమునకు రాను ప్రారంభించిన తర్వాత రాజశబ్దము యొక్క అపభ్రంశమైన రావు, రాయలు అనే పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత నాయక శబ్దముయొక్క ఆంధ్రాపభ్రంశమైన నాయుడు అనుపేరు వ్యవహారమునకు వచ్చింది. మరియు నాయక అనగా అక్కడక్కడా ఉండే పాళెములకును, సైన్యమునకును, (దండునకును) అధిపతులుగా ఉండిన ఆంధ్ర క్షత్త్రియ బంధువులకీ పేరుగలదు. అందువలనే నేటిదాక సైన్యములోని కొందరికి “నాయక” అనే అధికారమును మన గవర్నమెంటువారును బిరుదునామముగా ఇచ్చారు.

విజయనగరము ప్రబలముగానున్న కాలమందు ఆరాజు తన రాజ్యమును తొమ్మిది ఖండములుగా విభజించి ఒక్కొక ఖండమున ఒక్కొక్కరిని నాయడు అనే బిరుదు నామమిచ్చి నియమించారు. విజయనగరమును అచ్యుత దేవరాయలు రాజ్యభారము వహించి పాలించు కాలము లో అతని మరదలైన మూర్తియమ్మను చేవప్ప నాయుడు వివాహము చేసుకున్నాడు. అందుచే ఇతనిని తంజావూరును పాలించునట్లు చేసినదేగాక ఆ నగరమును స్త్రీధనముగా ఇప్పించుకున్నారు. ఇదిగాక ఆ కాలమునందు విజయనగరము నందు సుమారు 200 మందికి నాయుడు అనే బిరుద నామములిచ్చి రాజుకు సహాయకులుగా ఉండేలా నియమించబడ్డారు. ఈ విషయము మిస్టర్ న్యూవెల్ దొరగారు వ్రాసిన విజయనగర చరిత్ర 845 - 349 పేజీలలో ఉంది.

ఆ నాయడులలో కొందరి గురించి ఇలా వ్రాయబడినది

  1. అతివీర తిమ్మప్ప నాయుడు గారు - ఇతడు ఉదయగిరి, కొండవీడు, పెనుగొండ, కడప, సిద్ధవటము, గండికోట, నెల్లూరు, కనకగిరి, (కనిగిరి), ఒరిస్సా ప్రాంతములలో కొంత భాగమునకు అధిపతి. ఇతనికి ఆదాయము 8,00,000, లక్షల, బంగార మొహరీలు. ఇందు 3,00,000, లక్షలవరహాలు నరపతిరాజులకు కప్పమియ్యవలయును. మిగత ధనమును తాము తీసికొని, సంస్థానరక్షణమునకై 25,000 పదాతులను, 15,000 గుఱ్ఱములను, 40 ఏనుగులను సిద్ధముగా ఉంచుకోవాల్సిఉంది.
  2. గోపాలనాయుడు గారు - ఇతడు గోవా ప్రాంతములలోని రాజకులం, త్రిపురం, దిబ్మూలం, భోగలోలం, మొదలగు ప్రాంతములకు అధిపతి. ఇతనికి ఆదాయము:600,000 లక్షలవరహాలు. 1,50,000, వరహాలు నరఫతి రాజుకుకప్పము, 20,000, పదాతులను, 2,500 గుఱ్ఱములను, 20 ఏనుగులను సిద్ధ నుంచుకొని యుండవలసినది.
  3. లక్ష్మయ్య నాయుడు గారు - ఇతడు ధార్వాడకు దక్షిణమునందుండు బంకాపురము మొదలగు దేశములకు అధిపతి. ఆదాయము 3,00,000 లక్షల వరహాలు. 80,000 వరహాలు నరపతికి కప్పము 20,000 పదాతులు, 12,000 గుఱ్ఱములు, 28 ఏనుగులు నుంచుకొని యుండవయును.
  4. నరహరి నాయుడు గారు - ఇతడు నాగలాపురమునందు కొన్నాళ్ళు ధనాధికారిగానుండి ఆమీద బల్లారి, హర్పనమాల్లి, రాయదుర్గం, మొదలగు దేశములకు అధికారియైయుండెను. ఆదాయము 4,00,000 లక్షల మొహరీలు. నరపతికి కప్పము 20,00,000 మొహరీలు. 12,000 పదాతులను, 600 గుఱ్ఱములను, 20 ఏనుగులను నుంచుకొనియుండ వలసినది.
  5. చిన్నప్పనాయుడు గారు - ఇతడు మైసూరికి పశ్చిమమునుండి కొచ్చి వఱకుగల ప్రాంతములకు అధికారి. ఆదాయము 3,00,000 లక్ష్ముల మొహరీలు. నరపతులకు కప్పము 4,00,000 వరహాలు. 10,000 - పదాతులను, 800 గుఱ్ఱములను నుంచుకొనియుండవలసినది.
  6. కృష్ణప్ప నాయడు గారు - అశోల మొదలగు పరగణాలకు అధికారి. 20,000 మొహరీలు ఆదాయము. 7,000 వరహాలుకప్పము. 700 పదాతులను, 500 గుఱ్ఱములను నుంచుకొనవలసినది.
  7. విజయప్ప నాయడు గారు - ఇతనికి రాజప్ప నాయడనియు పేరుకలదు. ఇతడు మైసూరు, చిత్రదుర్గము, మొదలు మంగళూరు వరకు గల దేశములకు అధికారి. 3,00,000 లక్షల మొహరీలు ఆదాయము. 10,000 వరహాలుకప్పము 10,000 పదాతులు, 800 గుఱ్ఱములు, 15 ఏనుగలుండవలసినది.
  8. మల్లప్ప నాయడు గారు - కృష్ణ రాయలయొక్క గుఱ్ఱముదళమునకు కర్త. వీరు కళ్లికోట మొదలగు, మలయాళ ప్రాంతములకు కర్త. అతనికి 15,000 మొహరీలు ఆదాయము. 5,000 వరహాలు కప్పము. 6,000 పదాతులను, 400 గుఱ్ఱములను నుంచుకొనవలసినది.
  9. సాళ్వనాయడు గారు - ఇతడు నరపతులకి ఒకప్పుడు మంత్రిగా ఉండెను. తంజావూరు, నాగపట్టాము, తిరుక్కో వేలూరు, భువనగిరి, కాయల్ పట్టము మొదలగు లంక (సిలోక్) వరకుగల దేశములకు అధికారి. ఆదాయము 11,00,000, లక్షల వరహాలు. దీనిలో 3 ట నౌకభాగము కప్పము. 3000 గుఱ్ఱములు, 30,000 పదాతులు, 30 ఏనుగులునుంచు కొనవలసినది.
  10. విజయప్ప నాయుడు గారు - రాయచూరు మొదలగు ప్రదేశములకు అధికారి. 4,00,000 లక్షల వరహాలు ఆదాయము. 150,000 వరహాలు కప్పము. 150,00 పదాతులు, 1,000 గుఱ్ఱములు, 50 ఏనుగులు నుంచుకొనవలసినది.
  11. ఆదియప్ప నాయడు గారు - బల్లారి, గుత్తి మొదలగు ప్రదేశములకు అధికారి. 30,00,000 లక్షల వరహాలు ఆదాయము. 4,000 వరహాలు కప్పము. 8,00,000 పదాతులు, 800 గుఱ్ఱములు, 30 ఏనుగలు నుంచుకొనవలసినది.

ఈ ప్రకారముగానే ఇంకను అనేక నాయడు గార్లు అక్కడక్కడా నరపతి ప్రతినిధులుగా నుండి దేశమును రక్షించేవారు. 1609 -1623 లో మధుర దగ్గర ఉన్న విశ్వనాథ నాయడు గారి మనమడు ముద్దు వీరప్ప నాయడు గారు విజయనగర నరపతులకు 6,00,000 లక్షల వరహాలు కప్పము ఇచ్చేవారు. ఈ విషయమును మిస్టర్ నెల్సన్ దొరగారు వ్రాసిన మధుర చరిత్రలో చూడవచ్చును.

కర్ణాటక దేశ స్థితి.

విజయనగర రాజ్యముతో జేరిన నవఖండములలో కర్ణాటక ఖండము పెద్దది. ఈ ఖండమునకు ధర్మానాయడు గారు అధికారిగా ఉన్నారు. వీరి వంశీయులే శకాబ్దము 520 మొదలు 688 వరకు నేలుచుండిరి. చోళమండలము కూడా శకాబ్దము 670 మొదలు 710 వరకు వీరు తమ శక్తి చే స్వాధీనము చేసుకున్నారు. అది మొదలు చోళ దేశము 1222 వరకు నరపతుల పాలనలోనే ఉంది.

కృష్ణ దేవరాయల కాలములో తొండ మండలము, తుళువ మండలము, కొంకణ దేశము, చోళదేశము, పాండ్య దేశము, చేరమండలము మొదలైనవి వారి పరిపాలనలో చేరి ఉన్నాయి. ఆ కాలమున దక్షిణమందలి ఇంత గొప్ప రాజ్యమును 3 ఖండములుగా భాగించి, నెల్లూరు మొదలు కొల్లడము వరకు తుపాకి కృష్ణప్పనాయుడు గారిని పాలించునట్లును, తంజావూరు మొదలు కావేరితీరము వరకు విజయ రాఘవులు నాయడు గారిని పాలించునట్లును, కావేరీ తీరము మొదలు దక్షిణముకడ వరకు వేంకటప్పనాయడు గారిని పాలించునట్లును నియమించారు. ఇలా నియమించిన నాయుడుగార్లు ప్రజలకు సౌఖ్యము కలుగునట్లుగా పాలించేవారు. ఆ మీద ఈ నాయడుగార్లు తమచేతి క్రిందుగా కొందరు నాయడుగార్లకు కొన్ని కొన్ని గ్రామమములను పంచియిచ్చి పాలించునట్లు చేసారు. అయిన కాల వ్యత్యాసముచేత మహమ్మదీయులాదిగా గలవారిచే రాజ్యము ఆక్రమించబడింది. ఇప్పుడునటువంటి కొందరు బలిజ వంశ క్షత్రియుల చరిత్రములు వ్రాయబడుతున్నవి.

- నరసింహులు నాయుడు

Naidu gari Samsthanam

Naidu gari samstanam | naidugari Samstanam | naidu gari samsthanam | naidus kingdom telugu | musunuri kapaya nayaka | kapu zamindarlu