Chillagattu Sreekanth Kumar
Chillagattu Sreekanth Kumar గారు 1975 ఫిబ్రవరి 22వ తేదీన మదనపల్లెలో శ్రీమతి కుసుమ కుమారి, శ్రీ సుదర్శనం గారి పుణ్యదంపతులకు జన్మించారు.

Name | Chillagattu Sreekanth Kumar |
Born | 22 February 1975, Madanapalle, Annamayya (d.t), Andhra Pradesh |
Education | B.A, M.A, Diploma in Journalism |
Wife | Radha |
Daughter | Vedha Varshini |
Parents | Chillagattu Sudarsanam, Kusuma Kumari |
Occupation | Writer |
Social Media |
Chillagattu Sreekanth Kumar
" బతిజల చరిత్ర శ్రీకాంత్ కుమార్ గారి 25 సంవత్సరాల కల, కృషి "
"సింహాలు తమ చరిత్ర చెప్పుకోలేనంత కాలం వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర" అనే ఆఫ్రికన్ సామెతని విశ్వసించే చరిత్రకారుడే చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.. 1975 ఫిబ్రవరి 22వ తేదీన అప్పటి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) మదనపల్లెలో శ్రీమతి చిల్లగట్టు కుసుమ కుమారి, శ్రీ చిల్లగట్టు సుదర్శనం పుణ్యదంపతులకు జన్మించిన చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ బాల్యం నుండే సాంస్కృతిక రంగం లో ప్రవేశించి నాటక, నాటిక, ఏకపాత్రాభినయాల్లో బహుమతులు పొందారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచారు.
తండ్రి సుదర్శనం 'మదనపల్లె కల్చరల్ సొసైట్ ' వ్యవస్థాపకులు కావడమేకాక, ఆంధ్రపత్రిక దినపత్రిక కరస్పాండెంటు, పెద్దమనుషులు' తెలుగు జాతీయ పక్ష పత్రిక ఎడిటర్, పబ్లిషర్ కావడంతో శ్రీకాంత్ కుమార్ ఓనమాలు ఇక్కడే దిద్దుకున్నారు. కృష్ణాపురపాలక పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్ అనంతరం బిసెంటు దివ్యజ్ఞాన కళాశాలలో B.A. తెలుగు, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో M.A. తెలుగు, D.N.F కాలేజ్ లో Diploma in Journalism చేశారు.
వందలాది సాంస్కృతిక, సాహితీ, సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో సంస్థలనుండి ప్రతిభాపురస్కారాలు పొందారు. బి.టి. కళాశాలలో లెక్చరర్ గా కూడా పాఠాలు చెప్పారు.
మిరియాల వెంకటరావు గారి ప్రభావంతో కులచరిత్ర పై పరిశోధనకు పూనుకుని 2007, 2012, 2014, 2016 లలో వరుసగా నాలుగు గ్రంథాలను తీసుకు వచ్చారు. సినీమాధ్యమంలో వెలువరించిన చిరంజీవి ఒక విజేత కథ, పద్మశ్రీ అల్లు రామలింగయ్య జీవిత చిత్రం విశేషంగా వ్యాప్తి చెందాయి.. ఇవి కాక మరిన్ని రచనలు చేశారు.
చరిత్రను చారిత్రక నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో అధ్యయనం చేయాలే కానీ వాటికి 'కల్పన' ను జోడించకూడదని, అతిశయోక్తులు ప్రయోగించరాదని ప్రగాఢంగా విశ్వసించే శ్రీకాంత్ కుమార్ తొలితరం చరిత్ర పరిశోధకులు పగడాల నరసింహులు నాయుడు, కంటే నారాయణదేశాయ్, దమ్ము గురుమూర్తి నాయుడు వంటి వారి రచనలు పునర్ముద్రణ జరగాలని భావిస్తూ, సమకాలీన పరిశోధకులలో డా|| గుర్రం కొండ ప్రభాకర్, డా॥ సుంకర గిరిధర ప్రసాదరాయ్, మైనాస్వామి, పోలిశెట్టి సత్తి రాయుడు, ధూపం అభిమన్యుడు వంటి వారు మరిన్ని రచనలు చేస్తే జాతి ఔన్నత్యాన్ని భావి తరాలకు చాటిన వారమౌతామని, అది మా అందరి బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
పత్రికారంగ నేపథ్యం నుండి వచ్చిన వాడు కావడంతో కుల చరిత్రలపై నిబద్ధతే కాకుండా రాజకీయ విశ్లేషకుడిగా కూడా శ్రీకాంత్ కుమార్ సమకాతన రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నారు. సామాజికమాధ్యమాల్లో శ్రీకాంత్ కుమార్ రాజకీయ ప్రసంగాలకు, విశ్లేషణాత్మక కథనాలకు ప్రాచుర్యం ఉంటోంది. అతి త్వరలో 'బలిజల చరిత్ర ' ను విస్తృతరీతిలో గ్రంథంగా తీసుకు వస్తోన్న శ్రీకాంత్ కుమార్ ఇవి తన పాతికేళ్ళ కృషి గా అభివర్ణిస్తున్నారు. శ్రీకాంత్ కుమార్ అర్ధాంగి రాధ కర్నూలుకి చెందిన వారుకాగా, ఈ దంపతులకి వేదవర్షిణి సంతానం వీరి గోత్రం' ఈత.
chilagattu srikanth kumar | chilagatu srikanth kumar | chillagattu sreekanth kumar | chillagattu srikanth kumar | koppula prasad | Kapu Community