Dwarabandhala Rama Chandrayya Naidu

Dwarabandhala Rama Chandrayya Naidu, a Kapu freedom fighter, was born on 10th September 1860 and died on 23rd February 1880.

Dwarabandhala Rama Chandrayya Naidu

తిరగబడ్డ తెలగబిడ్డ - మన్యం పులి

Sri Dwarabandhala Rama Chandrayya Naidu

Name Dwarabandhala Rama Chandrayya Naidu
Born 10 September 1860
Death 23 February 1880
Parents Dwarabandhala Lakshmayya Naidu
Dwarabandhala Lakshmamma
Caste Telaga (Kapu)

ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు. అల్లూరి సీతారామరాజు గారికి ముందే బ్రిటిష్ పాలనపై తిరుగుబాటును లేవదీసి గొప్ప విప్లవకారిగా పోరాడారు.

తూర్పుగోదావరి, ఖమ్మం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న మన్యం అటవీ ప్రాంతాల్లో సాగు చేసే రైతులను బ్రిటిష్ అధికారులు, ముఠాదార్లు, భూస్వాములు, జమీందార్లు దౌర్జన్యంగా అణిచివేసేవారు. వారు రైతుల పంటలను దోచేసేవారు. ఈ అన్యాయాల నుండి తప్పించుకోవాలని రైతులు 1879లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ అధికారులు "రాంప పితూరీ" అని పిలిచారు.

చరిత్రలో ప్రాముఖ్యత పొందిన బొబ్బిలి తెలగ వీర యోధుల వంశానికి చెందిన శ్రీ ద్వారబంధాల లక్ష్మయ్య నాయుడు గారు మరియు లక్ష్మమ్మ గార్ల కుమారుడు అయిన శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు, భారతీయ దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యోధులలో ఒకరు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలంలోని నెల్లిపూడి గ్రామంలో, మేనమామలైన తెలగాలు శ్రీ "రవణం" వారింట్లో పెరిగాడు.

ఆయన శరీరాధారం చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆరడుగుల పొడవు, ఆజానుబాహు గల విగ్రహ రూపం, తేనె రంగు శరీర ఛాయ, ఉంగరాల్లాంటి జుట్టు, వెనక జులపాలు, మరియు చింతపిక్కరంగు గుర్రంపై కూర్చుని, తుపాకీ, కత్తి, బాకు, గండ్ర గొడ్డలి వంటి ఆయుధాలతో సంచారం చేసేవాడు.

చరిత్రదాచిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘చంద్రయ్య దొర' వీరగాథ ఇదీ!

ద్వారబంధాల చంద్రయ్య, పులిచింత సాంబయ్య, అంబుల్ రెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో సామ్రాజ్యవాదుల దోపిడీ, ప్రజల ప్రతిఘటనతో సంబంధించి మన్యం రైతులు, ముఠాదారులు, అధికారుల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పెద్ద పటిమైన తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. 1879 ఏప్రిల్‌లో రంపచోడవరంలో ప్రారంభమైన ఈ తిరుగుబాటు, పితూరి భద్రాచలం, రేకపల్లి, గోలుగొండ ప్రాంతాల వరకు విస్తరించింది. ఇందులో భాగంగా, ద్వారబంధాల చంద్రయ్య 1879లో అడ్డతీగెల పోలీసు స్టేషనును ధ్వంసం చేశాడు. అదే సంవత్సరంలో, చంద్రయ్య దొర అనుచరులైన 79 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. 1880 ఫిబ్రవరిలో, చంద్రయ్యను కూడా పోలీసులు కాల్చివేశారు.

ఈ తిరుగుబాటులో బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల, ముఠాదార్ల, భూస్వాముల, జమీందార్ల దౌర్జన్యాలకు ప్రతిఘటనగా పితూరీ ఉద్యమం నాటి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, రేకపల్లి ప్రాంతాల నుండి విశాఖపట్నం జిల్లాలోని గోలుగొండ ప్రాంతాల వరకు విస్తరించి పోయింది.

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే.. భారతదేశానికి స్వాతంత్ర్యం. భారతీయుల స్వేచ్ఛా కోసం ఎందరో తమ రక్తాన్ని చిందించారు. అలుపెరగని పోరాటం చేశారు. అందులో కొందరి యోధులు చరిత మాత్రమే వెలుగులోకి వచ్చింది. అందులో విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు సాగించిన స్వాతంత్ర్య పోరాటం యావత్ భారతదేశాన్ని కదిలించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. కానీ అంతకంటే ముందుగానే ఎంతోమంది ఆదిమ జాతి వీరులు సైతం తమ పరాక్రమంతో బ్రిటీష్ వారికీ నిద్రలేకుండా చేసారు. తెల్లదొరల సామ్రాజ్య, నిరంకుశత్వ, కుటిల, కుతంత్ర, కుట్ర, స్వార్థ విష కోరల నుంచి భరతమాతను విముక్తి కల్పించడానికి పెద్ద పోరాటమే చేశారు. కానీ దురదృష్టం కొద్దీ వారి చరిత్ర బయటకు రాలేదు. అటువంటి వారిలో ముందున్న వ్యక్తి ద్వారబంధాల చంద్రయ్య దొర. 1860 సెప్టెంబరు 10న విజయనగరం జిల్లా బొబ్బిలిలో జన్మించిన ఈ మహానుభావుడు, అల్లూరి సీతారామరాజు కంటే 40 ఏళ్ల ముందే బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పోగొట్టే ఒక విప్లవాన్ని చేపట్టాడు. అల్లూరి మన్యం పితూరి కంటే ముందు రంప పితూరి నడిపి, ఓ గొప్ప పోరాటాన్ని సాగించిన చంద్రయ్య దొరని వీరుడిగా గుర్తించకపోవడం చారిత్రక తప్పిదమే.

బొబ్బిలి ప్రాంతంలో పుట్టిన చంద్రయ్య దొర, తన బాల్యాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో తన మేనమామల ఆధీనంలో పెరిగారు. తుపాకీ కాల్చడం, విలువిద్య, కర్రసాము, గుర్రపు స్వారీలో మంచి పట్టు సాధించాడు. తనకంటే మొండివాడు, పరాక్రమవంతుడు కనిపిస్తే చాలూ... కఠోర సాధన చేసి ఓడించే వరకూ నిద్రపోయే వాడు కాదు. చంద్రయ్య దొర మేనమామలు రవణం వారు, నెల్లిపూడి ప్రాంతంలో పెత్తందారిలుగా ఉండి, వారు పిఠాపురం జమిందార్లకు ప్రతినిధులుగా పనిచేసేవారు. పన్నులు వసూలు చేయడం, ప్రాంతీయ, సామాజిక సమస్యలను పరిష్కరించడం వంటివి వారే చూసేవారు. అయితే, చంద్రయ్య దొర యుక్త వయస్సులోకి అడుగు పెడుతుండగా, రాష్ట్రంలో తీవ్ర కరువు రాజ్యమేలింది. కలరా, మశూచి, ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించాయి. సకాలంలో కావాలసిన వైద్యం లేక, వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితుల్లో కూడా, సంస్థానాధీశులు, జమిందార్లు పన్నుల వసూలు కోసం ప్రజల్ని పీల్చి పిప్పిచేసేవారు. జలగల్లా పీల్చుకు తినేవారు. పన్ను కట్టని వారి పొలాలు,పశువులు, చివరికి వ్యవసాయ పనిముట్లు కూడా వేలం వేసేవారు. దీంతో, ఎంతోమంది పొట్ట చేతిపట్టుకొని ఉన్న ఊర్లను, సొంత గ్రామాలను విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఆ సమయంలో బ్రిటీష్ పాలకులకు తొత్తులుగా మారిన సంస్థానాధీశులు, జమిందార్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు.

ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. అటు బ్రిటీష్ పాలకులు కూడా ఇవేవీ పట్టించుకోకుండా ప్రజలపై ఉక్కుపాదం మోపేవారు. వీటన్నింటినీ చూసిన చంద్రయ్య దొర రక్తం మరిగిపోయింది. అసలే పౌరుష వంతుడు కావడంతో అఘాయిత్యాలకు వ్యతిరేకంగా బలంగా పోరాడాడు. చింతాకుల అక్కయ్య ఇంటి దగ్గర, పెద్దిపాలెం ప్రాంతంలో మొదటి తిరుగుబాటు చేశాడు. పోరాటం జరుపుతున్న సమయం కరువు రోజులు కావడంతో విరివిగా గంజి సత్రాలు స్థాపించాడు. వీటి ద్వారా పేద గిరిజనులకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చాడు.

అటు ఖమ్మం.. ఇటు ఒడిశా వరకూ...

తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం నుండి ప్రారంభమైన చంద్రయ్య పోరాటం, ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల వరకూ విస్తరించింది. గిరిజనులు, హరిజనులు, బడుగు, బలహీనవర్గాలను ఒకటిగా చేసిన చంద్రయ్యదొర బ్రిటీష్ వారికి సవాల్ విసిరాడు. ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించారు. తెల్లదొరలకి పెద్ద తలనొప్పిగా మారారు.

కారం తమ్మన్నదొర, పులిచింత సాంబయ్య, అంబుల్ రెడ్డి వంటి ధైర్యవంతులైన యోధులతో కలిసి చంద్రయ్య దొర సామ్రాజ్యవాదుల దోపిడి ఆగడాలను నిరసించి, ప్రజల కోసం పోరాటం ప్రారంభించారు. ఆయన ప్రజా తిరుగుబాటును సృష్టించారు. మైదానంలో రైతులను, మన్యాలలో గిరిజనులను ఒకచోట చేర్చి, ఒక ఉజ్వల పోరాటాన్ని నడిపించారు. ఈ తిరుగుబాటు ఉగ్రరూపం దాల్చి, బ్రిటీష్ సామ్రాజ్యంపై ఘాటైన ప్రతిఘటనగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలోని బురదకోటను స్థావరంగా చేసుకొని, 1879లో చంద్రయ్య దొర బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించారు. రంపచోడవరం నుండి ప్రారంభమైన ఈ తిరుగుబాటు, రంప పితూరీ రూపంలో భద్రాచలం, రేకపల్లి, కొయ్యూరు, గోలకొండ ప్రాంతాలను అతిపెద్ద శక్తిగా వ్యాప్తి చెందింది.

డబ్బు, పదవీ ఆశ చూపినా...

రోజురోజుకూ చంద్రయ్య దొర ప్రభావం పెరిగిపోతోంది. ఆయనకు ప్రజల మద్దతు కూడా గణనీయంగా పెరిగిపోతుంది. పీడిత ప్రజలు చంద్రయ్య దొరను ఒక ఆరాధ్యదైవంగా చూడడం మొదలుపెట్టారు. దీంతో బ్రిటీష్ పాలకుల్లో కూడా ఆందోళన, భయం మొదలైంది. తమ పాలనకు ముగింపు పలుకుతాడని వారు అనుకున్నారు. దీనితో, ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అటు పదవి, డబ్బు ఆశ చూపించి, వాటి ద్వారా లోబరచుకోవడానికి ప్రయత్నించారు.

చంద్రయ్య తిరుగుబాటును ఆపడానికి కలెక్టర్ ఆయనకు ముఠా పదవి ఇస్తానని చెప్పగా… అందుకు ఆయన తిరస్కరించారు. సంస్థానాధీశ పదవిని ఆశ చూపినా, భార్య సీతమ్మ ఒత్తిడి చేసినా చంద్రయ్య ససేమిరా ఒప్పుకోలేదు. పదవిని తిరస్కరించడంతో బ్రిటిషు వారు ఆయనను ఎలాగైనా బంధించి చంపేయడం ఒక్కటే దారి అనుకోని, అతని బురద కోట స్థావరాన్ని బ్రిటిషు సైనికులతో ముట్టడించి తుపాకులతో కాల్పులు జరిపారు. వంటి నిండా గాయాలతో బయటపడిన చంద్రయ్య రహస్యంగా శరభవరం పారిపోయాడు. ఆ దాడి తర్వాత ఆయన 1879, ఏప్రిల్ లో అడ్డతీగల పోలీస్ స్టేషన్ మొత్తన్ని ధ్వంసం చేశాడు. దానికి ప్రతీకారంగా ప్రభుత్వం చంద్రయ్య మనుషులను 79 మందిని కాల్చి చంపింది. కారం తమ్మన్న దొరను గోరంగా చంపి రాజమండ్రి పరిసరాల్లో పడేసినట్లు అక్కడ నివసించే ప్రజలు చెప్తున్నారు.

భోజనంలో మత్తు మందు కలిపి..

చంద్రయ్య దొర ఉద్యమం ముందుకు సాగుతుండటంతో ఆంగ్ల ప్రభుత్వానికి అనుమానం మొదలైంది. ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తాడని భావించి, నిఘా పెట్టి చంద్రయ్య దొరని సజీవంగా లేదా నిర్జీవంగా నేనా పట్టుకున్న వారికి ప్రభుత్వం వేయి రూపాయలు బహుమతిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, చంద్రయ్య తన identity కాపాడుకోవడంలో మారు వేషాలు ధరించి తిరుగుతుండేవాడు. అడవిదారిలో ధాన్యం, పప్పుదినుసుల బండ్లను ఆపి, వాటిని పేద ప్రజలకు పంపిణీ చేసేవాడు. బంధువుల సహకారంతో చంద్రయ్య దొరను బంధించి చంపాలని కలెక్టర్, పిఠాపురం, కాట్రావులపల్లి, కోలంక, కిర్లంపూడి జమీందారులు ఒక పథకం వేశారు. ఆ తరువాత 1880 ఫిబ్రవరి 12న, చంద్రయ్యగారికి చాలా నమ్మకస్తుడిగా, అనుచరుడిగా ఉండే జంపా పండయ్య అనే వ్యక్తిని బ్రిటిష్ అధికారులు లోబరుచుకుని, ఆతనికి గొప్ప బహుమతులు ఇస్తామని చెప్పి ఆతని ద్వారా ద్వారబంధాల రామచంద్రయ్యగారి ఆచూకీ తెలుసుకొని, కిర్లంపూడిలో చంద్రయ్య దొర సమీప బంధువైన ఏనుగుల వెంకటస్వామి ఇంట్లో మత్తు మందు కలిపిన భోజనం పెట్టి, స్పృహ కోల్పోయేలా చేశారు. 1880, ఫిబ్రవరి 23న బ్రిటిష్ సైనికులు అతడి చేతులకు, కాళ్లకు బేడీలు వేసి కిర్లంపూడి ఏనుగుల వీధి, రామకోవెల దక్షిణ దిశగా ఉన్న రావి చెట్టుకు వేలాడదీసి ప్రజలందరి ముందు తుపాకులతో కాల్చి చంపారు. దీంతో ఓ మహోన్నతమైన శిఖరం ఏర్పడింది. కానీ ఆయన స్ఫూర్తి సజీవంగా నిలిచింది. అక్కడికి నాలుగు దశాబ్దాల తరువాత అల్లూరి రూపంలో మరో చరిత్రకారుడు, యోధుడు, ఉద్యమకారుడు పుట్టాడు.

దీంతో చంద్రయ్య దొర యొక్క పరాక్రమం ప్రపంచానికి తెలిసిపోయింది. అల్లూరి కంటే ముందుగా భారతీయుల స్వతంత్రం కోసం ఒక యోధుడు పోరాడాడని భావితరాలకు తెలిసింది. కానీ ఒక యోధుని పరాక్రమం శతాబ్ధం లేదా రెండు శతాబ్ధాల తరువాత వెలుగులోకి రావడం మాత్రం ఎంతో దురదృష్టకరంగా చెప్పవచ్చు.

dwarabandhala rama chandrayya naidu | dwarabandhala chandrayya dora | thota narasayya naidu | kapu caste freedom fighters | kapu community