Musunuri Nayakas

Musunuri Nayakas ముసునూరి నాయకులు ఏ కులంకి చెందినవారో పూర్తి ఆధారాలతో చరిత్రని చదివి తెలుసుకోండి. Kapu Community

Musunuri Nayakas

ముసునూరి నాయకులు

సూర్యవంశ మనువు కుల క్షత్రియ బలిజ శాసనం:

త్రిపురాంతక శాసన సంపుటి - బి.ఎన్. శాస్త్రి గారు ప్రథమ ముద్రణ - 1984 సంవత్సరం, ద్వితీయ ముద్రణలో 141 పేజి - శాసనం నెం. 77.

త్రిపురాంతకములోని త్రిపురాంతకేశ్వరాలయం, ఉత్తర కుడ్యముపై చెక్కబడిన శాసనమిది. శాసనము 29 పంక్తులతో కన్నడాంధ్ర భాషలలో చెక్కబడినది.

శాసనము : శక సంవత్సరం 1214 సంవత్సరం (క్రీ.శ. 1292) నందననామ సంవత్సరం బాధ్రపద బహుళ పాడ్యమి శుక్రవారము నాడు వారి తల్లిదండ్రుల పుణ్యమునకు గాను పెక్కండ్రు బలిజ వర్తకులు సంఘీ భావముతో త్రిపురాంతకేశ్వరుని అంగరంగ వైభవములకు మాడకు, మానెడు లేఖన అన్నీ గ్రామములందును త్రిపురాంతకం సంతలో ధాన్యము, బియ్యము, పెసలు, నువ్వులు మున్నగు వాటి అమ్మకముపై ధాన్యము వసూలు చేసి ఇచ్చునట్లు కట్టడి చేసికొని వేయించినది.

శాసనము - మూలము :

  1. స్వస్తి సమస్త ద్విజగురు దేవతాభక్తి మా (గ) తత్పురులం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య చాతువ = ణ్ F శ్రమధమ్మ = ప్రతిపాలితా
  2. (నేక హయ, గజాంభర, స్వణా ధన ధానయ సమృద్ధులం, అనద్వాహార కులం, ధండాయుధ హస్తులం, నిజాభరణులం విజయ
  3. మయ, మను, విశ్వకమ తోట కాచాయ్య ప్రవీణులం, అజాత శత్రులం; సంజాతమిత్రులం, వితరణ గుణ మాంధ్రాత్రులం.
  4. ని (ఖిలజన) మిత్రులం బ్రణమత ఫల ప్రారంభ సూత్రులం
    శ్రీ మనుమ కుల పవిత్రులం "స్వస్తి సమస్త భువన జన విఖ్యాత పంచశత
  5. శాసన గుణ గణాలంకృత సత్య చౌశార, చారిత్ర నయ వినయ విపుల విజ్ఞాన "వీరబలిం ధమ్మ - "ప్రతిపాలన విశుద్ధ గరుడధ్వజ విరాజిత
  6. సమాలబ్ది వరలక్ష్మి సమాలింగిత వక్షస్థల త్రిభువన పరాక్రమోన్నత “వాసుదేవ ఖండల మూలభద్ర వంశోద్భవ ; అహిచ్ఛత్రనిఘా తరు.

జవాబు : మనువు కులము అనగా సూర్యవంశ క్షత్రియ కుటుంబములో జన్మించిన పవిత్రులమనియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన 500 శాసనములు గల వారమనియు శ్రీ మహావిష్ణువు రథసారధి (వాహనం) గరుత్మంతుడు ద్వజముగా గల వారమనియు శ్రీమహావిష్ణువు అంశగా జన్మించిన శ్రీ కృష్ణుడు వాహనం) క్షత్రియ బలిజలమనియు, అహిచ్ఛత్ర పురాధీశులమని చెప్పారు.

ముసునూరి వారి శాసనములో "ముసునూరాన్వయులు" అనగా ముసునూరు వంశము అని అర్ధము.

  1. ముసునూరి కొమ్మి నాయుడు "దామలూరి పురాధిపతి' క్రీ॥శ॥ 1155 నాటివాడు. అమరేశ్వర స్వామి (అమరావతి) ఆలయ శాసనము : వెలనాటి కుళుత్తోంగ చోళుడు మంత్రి గొంకరాజు మంత్రి వేయించినది.
  2. ముసునూరు ముచ్చి నాయుడు క్రీ॥శ॥ 1221 నాటివాడు. ఇతని శాసనము జమ్మిపల్లిలోనూ, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా దుర్గిదేవిపాడు దగ్గర పాది పాడు గ్రామం (క్రీ॥శ॥ 1220) (A.R.No : 188 ఆఫ్ 17-జమ్మిపల్లి)
  3. ముసునూరి సూరపనాయుడు, నెల్లూరు చోళ బలిజరాజు గండగోపాల తిరుకాలిత్త దేవరాజు సామంతుని వద్ద అధికారి. కందుకూరు దగ్గర "ఓగూరు” కేంద్రంగా (కావలి, సింగరాయకొండ, పెదపవని) ఈ ప్రాంతానికి అధికారిగా క్రీ॥శ॥ 1231 నాటివాడు (A.R.No : వాల్యూం-8)
  4. ముసునూరు ఉప్పినీడు క్రీ॥శ॥ 1296 సంవత్సరం ప్రాంతీయుడు పాలకొల్లు
    శాసనం.
  5. ముసునూరు కొండయ్య క్రీ॥శ॥ 12వ శతాబ్దము నాటివారు. ఇతడు తూర్పు చాళుక్య బంధువర్గములోనివాడని "బాపట్ల భావనారాయణస్వామి దేవాలయ శాసనం తెలుపుతుంది.

ముసునూరి నాయకులు

ముసునూరు నాయకులు "క్షత్రియ బలిజలు - శాసనము

2. శాసనం : క్రీ॥శ॥ 13వ శతాబ్దమునకు చెందిన కమ్మనాటి శాసనం

  1. శ్రీ త్రిభువన చక్రవర్తి - శ్రీకుళుత్తోంగ చోడదేవ
  2. దివ్య సంవత్సరంబులు "కమ్మనాట్టి" ఉత్తమచోడవల నాంటి
  3. తూప్ప F నాణ్డ ముసుణ్ణూరి జక్కిరెడ్డి కొడుకు గాణ్ణయ
  4. కమ్మనాణ్ణి శ్రీ బావదేవరకు దివ్యకుడలు గాని గురి వారి వలన బెట్టిన
    వెల్లెడ్లు RO తిరుచుట్టు
  5. మాలయకుడతిగా కాసిలకిచిరి.

శాసనము అర్ధం : క్రీ॥శ॥ 13వ శతాబ్దం - శ్రీ కుళుత్తోంగ చోడదేవ మహారాజు కాలము, ముసునూరి జక్కిరెడ్డి కుమారుడు గుండయ్య బావదేవరస్వామికి సమర్పించిన
దానశాసనం.

ముసునూరి అమిరిశెట్టి శాసనం

శకవర్షంబు తౌ॥ క్రీ॥శ॥ 13వ శతాబ్ది, ముసుండూరి గొసవి అమిరిశెట్టి శ్రీవల్లభుని అర దీపానికి పెట్టిన ఆవులు: 25

  1. శ్రీ శకవరషంబులు ౧౧౨౨ మునాండు "ముసునూరి "గొసవి అమిరి
  2. సెట్టి శ్రీ వల్లభునికి పెట్టిన అరదాలు ౨ ఆ చంద్రా
    ర్కముశ్రీ - అదే చోట,
    A.R. No: 137/1893/nO: 954/S11, IVP-313-
    వైశాఖమాసం శుద్ధ పాడ్యమి శుక్రవారం
    ముసునూరు నాయకులను "నాయుడు, రెడ్డి, శెట్టి - బిరుదులున్నాయి - గాబట్టి
    వీరు బలిజ (తెలగ, కాపు) కుటుంబం

నెల్లూరు జిల్లా "ముసునూరు" గ్రామం (కావలి మండలం)లో "పెనుమదుల" వారు బలిజ నాయుడులుగా గౌరవరం, పామూరు మండలం బలిజపాలెం (ప్రకాశం జిల్లా) తలమంచి A.S. పేట (నెల్లూరు జిల్లా) యల్లంపేట (కడప జిల్లా) గ్రామాలలో కలరు. వీరు బలిజ నాయుడులుగా ఉన్నారు.

జక్కిరెడ్డి వారు : జక్కిరెడ్డి ఇంటి పేరు గల బలిజలు అనంతపురంలో 10 కుటుబాలు
"బలిజ నాయుళ్ళు"గా ఉన్నారు.

నెల్లూరు జిల్లా కావలి మండలం, ముసునూరు గ్రామ ప్రాంతము నుండి కాకతీయ సేవా నాయకులుగా ఓరుగల్లు ప్రాంతము చేరారు. ముచ్చినాయుడు నల్గొండ జిల్లా అమని గల్లు పాలకుడుగా ఉండేవాడు. వారిలో పోతినాయకుడు, దేవానాయకుడు (తర్వాత కామా నాయకుడు, రాజా నాయకుడు అనే నలుగురు అన్నదమ్ములు" తెలగ కులస్థులు" కాకతీయుల వద్ద సైనికాధికారులగా "కట్టు" అధికారులుగా ఉండేవారు. వారిని "కట్టుకాపు" కులస్థులని విద్యారణ్యస్వామి వ్రాసిన విద్యారణ్య శిక్ష" అనే గ్రంథములో వ్రాశారు. ఆయన “ఓరుగల్లు” నివాసి (13వ శతాబ్దము), ప్రోలయ నాయకుని "విలాస శాసనం"కాపయ్య నాయకుని పోలవరం శాసనం, చోడభక్తిరాజు, పెంటపాడు శాసనం, 'కాకతీయ వైభవ తోరణాలు" గ్రంథం - ప్రొ॥ పోలవరపు హైమావతి, అమ్మ నుడి మాస పత్రిక" - 2016 ఆగస్టు నెల 42వ పేజి - ముసునూరు సోదరులు - వ్యాసము - వ్రాసినవారు - గంగుల బాబు - సత్తుపల్లి - ఖమ్మం జిల్లా.

కాకతీయ ప్రతాపరుద్రుడు స్వర్గమున కేగిన పిమ్మట త్రిలింగ దేశము “ముస్లీం పాలకులచే ఆక్రమించబడియుండ సముద్రములో మునిగి ఉన్న భూమండలమును ఆదివరాహావతారుడగు నారాయణుద్దరించినట్లు యవనోధరస్థమగు ఆంధ్ర దేశమును "ప్రోలయ నాయకుడు అతని అనంతరం వారి సోదరుడు కాపయ్య నాయకుడు రాజ్యమునకు వచ్చిరి.

పూర్వ చరిత్ర : ఓరుగల్లు ప్రతాపరుద్రుడు పాలిస్తున్న కాలములో ఎవరికీ అంకెకురాని ఒక అరబ్బీ గుర్రాన్ని లొంగదీసి స్వారీ చేశాట "ఒక వెలమవీరుడు" అందుకు ప్రతాపరుద్రుడు, సంతసించి అతనిని "అశ్వరాయుడు అని బిరుదు నిచ్చి తన "శంకరగిరి" పరగణ్యలలో చిన్న ప్రాంతానికి మండలాధిపతిగా నియమిస్తాడు. అది ప్రస్తుతం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట దగ్గర ఉన్న పాలవరప్పాడు ప్రాంతము, పాలవరప్పాడు కేంద్రంగా పాలన సాగించారు.

అశ్వారావుపేట, అశ్వాపురం అతని పేరు మీద వెలసిన గ్రామలే అశ్వారాయుడు పశ్చిమ తెలంగాణా నుండి కొత్తగా ఈ దండకారణ్యములోని "మండల పాలకుడు"గా వచ్చిన వాడు, ఇది అతనికి కొత్త ప్రాంతం. ఇతనికి స్థానికుల అండదండలు అవసరము. తన "పాలవరప్పాడు" కు దగ్గరలోనే "ముసునూరు" అనే ఊరు (ప్రస్తుతం అది ముష్టిబండ) (వెల్లూరు జిల్లా కావలి దగ్గర ముసునూరు ప్రాంతం నుండి కాకతీయ సైనికులుగా వచ్చి ముసునూరు నాయక కుటుంబం. ఖమ్మం జిల్లాలో "ముసునూరు" గ్రామం నిర్మించారు) రైతు కుటుంబానికి చెందిన "పోలయ" అతని దృష్టి నాకర్షించాడు. అతడు యువకుడు మేధావి. యుద్ధవీరుడు. అతని తమ్ములు కాపయ్య, పోతయ్య కూడా చిన్న వారయినా అన్నకున్న లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. ఈ ముగ్గురూ అశ్వారాయుడికి అండదండలందించారు. వీరు స్థానికులు. కోయ భాష కూడా తెలిసిన వారవడంతో ఆ మండలమంతా కోయవారు అధిక సంఖ్యలో వున్నారు. గనుక పెద్ద వాడయిన పోలయ్యకు మండల బాధ్యతనంతా అప్పగించి తన మండలాన్ని త్వరిత గతిన వృద్ధిపరిచారు. ఇంతలో ఢిల్లీ సుల్తాను తో చివరి యుద్ధంలో రెండవ ప్రతాపరుద్రుడు అపజయంతో ఓరుగల్లు సామ్రాజ్యం ముగిసింది. యుద్ధవీరులయిన అశ్వారాయుడు, పోలయ్య నాయకుడు సహజంగానే ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ప్రతాపరుద్రుని బంధించి ఢిల్లీకి తీసుకొని వెళుతుంటే మధ్యలో నర్మదానదిలో పడి ప్రాణత్యాగం చేశాడు. ఆ యుద్ధంలో పాల్గొన్న వీరులంతా ఇంచుమించుగా చంపబడ్డారు. ప్రాణాలతో దొరికిన కొందరిని ఢిల్లీకి బంధీలుగా తీసుకొని పోయారు. ఆ యుద్ధము నుండి ప్రాణాలతో తప్పించుకున్న కొద్ది మందిలోనివారు అశ్వారాయుడు, పోలయ్య నాయకుడు. వీరు తమ గ్రామాలకు వచ్చి తమ కుటుంబాలతో సహా గోదావరి నది అవతలి ఒడ్డున ఉన్న "రేకపల్లి" గ్రామంలో తలదాచుకున్నారు. ఇది క్రీ॥శ॥ 1323 నాటి సంగతి.

రేకపల్లి గ్రామం : ఈ రేకపల్లి గ్రామమునకు ఉత్తర, తూర్పు దిశలలో పాపికొండలు
విస్తరించి ఉన్నాయి, దక్షిణాన గోదావరి, పడమర శబరీ నది, వీటి మధ్యనున్నది రేకపల్లి గ్రామం. పాపికొండల మధ్య వెళ్ళే గోదావరి నది రెండు కొండల మధ్య ఉన్న చిన్న ఇరుకైన సందు గుండా ప్రవహించడం వల్ల అక్కడ సుడులు తిరుగుతుంది. వానాకాలంలో ఆ ఇరుకు నుండి వరద మొత్తం వెళ్ళలేక వెనుకకు పోటు వస్తుంది. పైన శబరీ నది, పెదవాడు, ఇంకా పైన కిన్నెరసాని, తాలిపేర్ల వరద కలిసి సముద్రమవుతుంది. మానవ మాత్రులెవరూ పాపికొండల సందులో సుడులను దాటి దక్షిణాధికి చేరలేరు. అట్లే ఉత్తరాన ఉన్న పెద్ద పర్వత శ్రేణులను దాటి రాలేరు. పడమర ప్రళయ భీకరంగా వచ్చే తాళి పేరు నది. శబరీ నది దాటడం అసాధ్యం, కనుక శత్రు దుర్భేద్యమైనది" రేకపల్లి గ్రామము వానాకాలం నాలుగు నెలలు రేకపల్లికి ఇతర ప్రపంచముతో సంబంధం తెగిపోతుంది. ఇక ఆహారము విషయానికి వస్తే, ఆకులు, అలములు, దుంపలు, పండ్లు, ఫలాలు, వేటాడితే మాంసం తప్ప తినడానికి ఏమీ దొరకదు. రోగాలు, రొచ్చుల సరేసరి. తూర్పు కొండల మీద సూర్యోదయం రాగానే ఇక్కడ మాత్రమే సూర్యకిరణాలంటే ఎండ పడుతుంది. మిగిలినదంతా సూర్యకిరణ్యలు చొరని దుర్భేద్య అరణ్యము చుట్టూ అడవి ఇక్కడ కొద్ది ప్రాంతం. రాతి నేల అవడం వలన చెట్లు లేక "వెలుగురేఖలు" పడుతుంది. అందువల్లనే ఈ గ్రామమును రేఖపల్లి అని పేరు పెట్టి ఉండవచ్చును.

ఇంతటి అరివీర భయంకరమైనది గనుకనే అశ్వారాయుడు ప్రోలయ నాయకుడు
తమ రక్షణఖు ఈ ప్రాంతం ఎన్నుకున్నారు. అక్కడ ఉన్న అటవిక జాతి కోయలు, కోయండు అంటేనే ధనుర్ధారి అని అర్థము. వారిని చేరదీసి వారి సహాయముతో పూర్వము చోళుల కాలంలో వున్న శిథిలమైన చిన్న కోటను, పునర్నిర్మించారు. అశ్వారాయుడు కొంత ఆర్ధిక సహాయం చేశాడు. ఆ చిన్న కోట స్థలము జల, గిరి, వన, దుర్గ లక్షణాలన్ని కలకలిపి యున్నది. ప్రోలయ నాయకుడు తన తమ్ములు, కాపయ్య, పోతయ్య నాయకుడు, స్థానికులు గనుక కోయభాష తెలిసినవారు గనుక తేలికగా కోయ వీరులను సమీకరించ గలిగారు. వీరు గురి తప్పని విలుకాండ్రు. ఎల్లప్పుడూ విల్లంబులు ధరించే ఉంటారు. అడవులు దాటిరారు. మన మైదాన ప్రాంతీయులను అస్సలు నమ్మరు. శత్రువుల వలె చూస్తారు. వీరు నమ్మి ఒక అభిప్రాయానికి వస్తే ప్రాణం పోయినా ఆ నిర్ణయానికే కట్టుబడి వుంటారు. తమ రక్షణ కొరకు ఇటువంటి వీరులను మచ్చిక చేసుకొని సైనిక శిక్షణ ఇచ్చారు ముసునూరు సోదరులు.

ఓరుగల్లును జయించిన "ఉలుక్కాన్" మొత్తం ఆంధ్రదేశ పాలనను తన చేతిలోనికి తీసుకొనదలచి వరంగల్ ప్రాంతమంతా తన పాలన క్రిందికి వచ్చిన తర్వాత మిగితా ఆంధ్రా ప్రాంతంపై దృష్టి పెట్టారు. సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి ఒకదాన్ని ఖమ్మం నుంచి ఆగ్నేయంగా కొండపల్లి వైపు నడిపి మరొక దాన్ని తన నాయకత్వంలో ఖమ్మం నుండి తూర్పుగా బయలుదేరి దండుబాటలో నున్న కనకగిరి, శంకరగిరులను స్వాధీనం చేసుకొని వ్యతిరేకులను ఏరివేస్తూ విశ్వాసపాత్రులయిన వారిని తగిన కేంద్రాలలో నియమిస్తూ ఆ సామంత రాజ్యాలలోని, మండలాలు, కల్లూరు, నీలాద్రి, తమ్మిలే ఒడ్డునున్న తుంబూరు, దమ్మపేట, కోటలను దోచుకొని బ్రాహ్మణులను చంపి, దేవాలయాలను కూలగొట్టి కూల్చి దండుబాటనే ఉన్న పోలయ్య నాయకుడు, అశ్వారాయుడుల ఊర్లు "ముసునూరు"ను పాలవరప్పాడు తగులబెట్టి ప్రస్తుతమున్న ఖమ్మం సరిహద్దు దాటి పశ్చిమ గోదావరి ప్రాంతములో ప్రవేశించి కామవరపు కోట "నిడుదవోలు"ను పట్టుకొని అచట తన వారిని నియమించి రాజమండ్రి చేరి దానిని తన పాలనలోకి తెచ్చుకొని అచట తన వారిని నియమించి అచట వున్న పెద్ద దేవాలయాన్ని దోచి కూల్చి దాని గోడలపై మసీదు నిర్మిస్తాడు. క్రీ॥శ॥ 1324 సం॥ మసీదుగా మారినట్లు శాసనం వేయించాడు. ఖమ్మం నుండి ఆగ్నేయంగా తరలివెళ్ళిన సైన్య విభాగానికి కొండపల్లిలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆరునెలల పాటు ముట్టడించి దాని స్వాధీనం చేసుకొని అక్కడున్న ప్రసిద్ధ దేవాలయాన్ని ధ్వంసం చేసి దాని గోడలపై మసీదును గట్టి పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, కొండపల్లికి దక్షిణాన ఉన్న ఆంధ్రా ప్రాంతాన్నంతా స్వాధీనము చేసుకొని క్రీ॥శ॥ 1324 సం॥ నాటికి రాజమండ్రి చేరి మొదటి సైనిక విభాగముతో కలిపి ఒరిస్సా రాజును శిక్షింప పయనమవుతాడు. క్రీ॥శ॥ 1324 సం|| నాటికి కాకతీయ సామ్రాజ్యం ఉలుగ్ ఖాన్ చేతికి వచ్చింది. ఇంతలో ఢిల్లీ సుల్తాన్ గయాజుద్దీన్ తుగ్లక్ మరణిస్తాడు. సహజంగా తలెత్తే వారసత్వ సమస్యలు, సామంతుల తిరుగుబాట్లతో ఉలుగ్భన్ అతని సోదరులు, తలమునకలై ఉండగా ఆంధ్రదేశ పాలనలో శ్రద్ధ చూపలేకపోయారు. దీన్ని పోలయ్య నాయకుడు చక్కగా వినియోగించుకొన్నాడు. ముస్లీములతో భంగపడి తమవలె అజ్ఞాతములో జీవితం వెళ్ళదీస్తున్న నాయకులతో రహస్య మంతనాలాడి తిరుగుబాటుకు సమాయత్తపరిచి, కాపయ్య నాయకుడు, పోతయ నాయకుడు తనకు కుడి వెడమల నిలువగా తాము ముగ్గురూ తయారుచేసిన మెరికల్లాంటి గురి తప్పని కోయ విలుకాండ్ర సైన్యముతో స్వాతంత్య్ర పరిరక్షణకై, కదలగా, ఇంతకు ముందే తిరుగుబాటుకు అంగీకరించిన తమ లాంటి మరికొందరు నాయకులు తమతో తరలిరాగా ప్రజావాహిని, జయ, జయ ద్వానాలతో స్వాగతించగా అనతికాలంలోనే క్రీ॥శ॥ 1326 సం॥ నాటికే తూర్పు తీరం మొత్తాన్ని కైవశం చేసుకొని స్వాతంత్య్రం ప్రకటించాడు. ప్రోలయ నాయకుడు ఇలా ఆంధ్రా ప్రాంతానికి తిరుగులేని నాయకుడైనాడు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన అశ్వారాయుడిని గోదావరి దక్షిణ దిక్కునుండి ఏలూరు వరకున్న విశాల భూభాగాన్ని కట్టబెట్టి తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. తన చిన్న తమ్ముడు పోతయ్య నాయకుని "తొయ్యేటి" పాలకుడిగా నియమించారు. మిగిలిన ప్రాంతాలకు తనకు అండగా నిలిచిన నాయకులను నిలిపాడు. అశ్వరాయుడు తన కొత్త సామంత రాజ్యానికి మధ్యస్థంగా "శంకరిగిరి" కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించాడు. తీరాంధ్రం తర్వాత ప్రోలయనాయకుని దృష్టి "ఓరుగల్లు" పై పడింది. కానీ ఓరుగల్లును స్వాధీనం చేసుకొనేలోపు ఆయన అనారోగ్యంతో మరణించాడు. ఆయన కోరికను ఆయన పినతండ్రి కుమారుడు కాపయ్య నాయకుడు అన్నగారి బాధ్యత తీసుకొని ఓరుగల్లును స్వాధీనం చేసుకొని మొత్తం తెలుగుదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని వారి అన్న ఆశయాన్ని నెరవేర్చాడు. కాపయ్య నాయకుడు విజయనగర సామ్రాజ్యస్ఫూర్తి ప్రదాత. ఓరుగల్లు విజేత కాపయ్య నాయకుడు క్రీ॥శ॥ 1336లో విజయనగర (హంపి) స్థాపన జరిగింది.

బుడమేరు ఒడ్డున ఉన్న గ్రామాన్ని తన అన్న పేరున "ప్రోలవరం"గా మార్చి అగ్రహారంగా బ్రాహ్మణులకు దానమిచ్చాడు. (అదే ఈనాటి "పోలవరం ప్రాజెక్టు") వారు ముసునూరు వారమని తెలుపుకున్నారు. 1944 నాటి రెడ్డి రాజ్యాల చరిత్రలో దక్షిణాన నూజివీడు దగ్గర ముసునూరు, కావలి దగ్గర "ముసునూరు" గ్రామం గాని అయి ఉండవచ్చునని మల్లంపల్లి సోమశేఖర శర్మ తెలిపారు. డా॥ పోలవరపు హైమావతి (ప్రొఫెసర్) గారు కూడా దానితో ఏకీభవించారు. కాని దండకారణ్యములోని ఇక్కడే ఉన్న ముసునూరు గ్రామాన్ని గుర్తించలేదు. అప్పటికీ ఈ ప్రాంతము అడవి ప్రాంతములో ఉండడమే కారణం. సంవత్సరములో అధిక భాగం వానలు, వరదలతో అన్నం కరువై ఆకులు, అలములు, గడ్డలు, పండ్ల, తింటూ రోగాలు, రొచ్చులతో నుండే ఈ భయంకరారణ్యానికి పల్లపు ప్రాంతాలలో రకరకాల పంటలు పండిస్తూన తిండికి కరువుతో కడుపులో చల్ల కదలక హాయిగా ఉండేచోటు వదిలి ఈ అరణ్యములోకి ఎవరైనా వస్తారా? చెప్పవలసి వస్తే ఇక్కడి వారే బ్రతుకు దెరువుకు అటువైపు వెళ్ళిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రోలయ నాయకుడి పూర్వులు నెల్లూరు జిల్లా కావలి దగ్గర ముసునూరు వాసులని శాసనాలు చెబుతున్నాయి. అక్కడ నుండి కాకతీయుల సైనికాధికారులుగా తర్వాత వారి అన్నదమ్ములు అనేక యుద్ధాల కారణంగా ఖమ్మం జిల్లా ముసునూరు (ఈనాటి ముష్టిబండ) చేరి వ్యవసాయం సైనిక వృత్తి చేయు కుటుంబం - ప్రోలయ నాయకుడు, కాపయ్య, పోతయ్యలు అక్కడే జన్మించి ఉండి స్థానికులు అయి ఉండవచ్చును. అందువలననే ఇక్కడి అటవీ భూములు ఆటవిక జనాలతో పరిచయమున్న వాడయినందువలననే కొద్ది వ్యవధిలోని కోయ వీరులను కూడగట్టి సైన్యాన్ని తయారు చేసుకోగలిగాడు. తీరాంధ్ర దేశాన్ని జయించగలిగాడు.

అశ్వారాయుడు మొదటి పాలితప్రాంతమైన "పాలవరప్పాడు"కు సమీపంలోని ముష్టిబండ” అని పేరుతో గ్రామముంది అదే ముసునూరు, ముష్టి తెలుగుపదం, దీని పూర్వరూపం, ముసిటి ముసిడి, ముసిని, వర్ణ సమీకరణం వల్ల ఆ తర్వాత ముస్జిగా మారింది. ముసిండూరు, ముసిణూరు, ముసినూరు ఇదే పరింగావు క్రమంలో రూపభేదాలు సూర్యరాయాంధ్ర నిఘంటువు 700 పేజీలో చూడండి) అట్లే ప్రతి ఆయుర్వేద గ్రంథములో ముష్టిని "ముసిణి"గానే వ్రాశారు.

ముసునూరి వారి కులము : కీ॥శే॥ కనకబండి మోహనరావు గారు చారిత్రికో పాన్యాసకులతో కలిసి "గంగులబాబు" గారు కలిసి వారు చేయబోతున్న "కాటమరాజు చరిత్ర" గూర్చి తెలుసుకునేందుకు ఈ ముష్టిబండ గ్రామంలోని వృద్ధుడైన గొల్ల (యాదవ) కులస్థుడైన శ్రీరాచూరి మల్లయ్య గారిని కలిశాము. ఆయన తర తరాల నుండి చెప్పుకుంటూ వస్తున్న చారిత్రక విషయాలెన్నో తెలిపారు. మా పూర్వీకులు, ఆయుదోప జీవులని, పూర్వమెప్పుడో తగలబడిపోయిన తమ ఇండ్లలో మిగిలిన ఇనుప కత్తులు, పిడులు, బల్లెపు మొనలు చూపించి మావారు రాయచూరు నుండి వచ్చారు. కనుక మేము “రాచూరి వాళ్ళమయ్యాము. ఆనాడు పడమట నుండి తూర్పుకు దండుబాట ఈ బాట గుండానే వెళ్ళేది అందుకే దీనిని దండుబాట అంటారు. దాన్నే ప్రభుత్వం రోడ్డుగా మార్చి బస్సులు నడుపుతున్నది. మొదటి ముష్టిబండ ఊరు ముసినూరో, ముసునురోనట, మా పెద్దలు చెప్పేవారు. అంటూ కాటమ రాజుపై పరిశోధనకు వచ్చిన "కనకబండి మోహనరావు | గారికి అటక మీదున్న శిథిల తాళపత్ర గ్రంథాలు నుండి దుమ్ము దులిపి చెడకుండా ఉన్న తాళపత్ర గ్రంథాలనిచ్చారు. చిత్రమైన విషయమేమిటంటే కనకబండి మోహనరావు పూర్వీకుడు కనకబండి గట్టయ్య, గంగుల బాబుగారి పూర్వీకుడు. గంగుల పినయల్లయ్య వ్రాసిన కాటమ రాజు కథ చక్రమే ! దానిని తన డాక్టరేటుకు అవసరమైన మేర వాడుకొని ఆ గ్రంథాన్ని హైద్రాబాద్ పురావస్తు శాఖకు అందజేశారు. ఆయనే మాకు మరో సంగతి తెలిపారు. మాలాగానే అనాధిగా ఈ గ్రామములో వుంటున్న కుటుంబం “గండ్రెతు” వాళ్ళు తెలగాలు. వెనుకటి రోజుల్లో ఈ ఊరి పెత్తందార్లు వారేనట, తురకలదండు వస్తున్న సంగతి ముందే పసిగట్టి, గండ్రెతు కుటుంబము "ప్రోలయ, కాపయ్య, పోతయ్యలు తమ పిల్లా, జెల్లా, ముసలి, ముతకలతో సహా ఉత్తర దిశకు పారిపోయారట. ముసలోళ్ళకు మన్నె జ్వరము వస్తే వాళ్ళనక్కడే వదిలేసి వాళ్ళ రక్షణకు, మరికొందరి నక్కడే వుంచి తాము గోదావరి దాటి "రేకపల్లి" చేరారట. కాలం కుదుట పడటంతో మధ్యలో ఆగిపోయినవారు తిరిగి ఇక్కడకే వచ్చారు. కాని "రేకపల్లి" వెళ్ళినవారు రాలేదట. అక్కడ నుండి గండ్రెతు కుటుంబపు వృద్ధులు శ్రీ గండ్రాతు నర్సయ్య గారిని కలిశాము. ఈయన గారు చెప్పిన విషయాలనే ఆయన చెప్పారు. మాయింటి పేరు మొదట "గండ్ర" అనే పేరుండేదని తెలిపారు. మీ వారెవరికి పూర్వుల పేర్లెందుకు పెట్టలేదని అడిగాము. పోలయ్య, కాపయ్య, పోతయ్య వీరు మా కుటుంబీకులయినా
ఆ పేర్లు పెట్టుకున్న మా కుటుంబీకులకు కలిసి రాలేదు. అచ్చిరాలేదు. ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు మధ్యలో చనిపోయారట. అందుకని వాటి జోలికి పోరు అని మా పూర్వీకులు చెప్పేరని చెప్పారు. ప్రోలయ్య, కాపయ్య, పోతయ్య వీరు అకస్మాత్తుగా అప్పటికప్పుడు వీరులుగా తయారయిన వారు కాదు. వీరి కుటుంబమే వీర కుటుంబం. వీరి పూర్వులలో ఎందరో గండరగండడైనందును అతని పేరున ఆ కుటుంబానికి, గండ, గండర అని పేరు గండ్రగా మారింది. తర్వాత వారు వీరులు కాబట్టి అశ్వదళ నాయకులుగా, గండరౌతు, గండ్రెతుగా స్థిరపడింది. ముసునూరు నుండి వెళ్ళిన వారు గనుక ప్రోలయ నాయుడు, కాపయ్య నాయుడు, ముసునూరి వారిగా ముసునూరు సోదరులుగా పిలువబడ్డారు. వీరు తెలగ కాపులు, పోతయ్యనాయకుడు, “తొయ్యేటీ” ప్రభువయ్యాక వారి కుటుంబీకులు "తొయ్యేటి” వారు.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర తెలిక చర్ల దగ్గర రావూరి పాడు 100 గడప దగ్గర రెడ్డిపల్లి వారు అయ్యారు. ఇపుడు గండౌతు, వి.వి. వినాయక్ గారు సుప్రసిద్ధ తెలుగు సినీ దర్శకులు, తెలగాలుగా వున్నారు. రేకపల్లి రెడ్డి నాయుడు (తెలగ) భార్య శ్రీమతి మహాలక్ష్మి (కశ్యప గోత్రం) తూర్పుగోదావరి జిల్లా - అమలాపురం దగ్గర సిద్దాంతం గ్రామం. ఆయర్వేద వైద్య కుటుంబముగా ఉన్నది. వీరు కృష్ణాజిల్లా రేకపల్లి గ్రామం నుండి వచ్చినట్లు చెబుతారు. రేకపల్లి ఈనాడు ఖమ్మం జిల్లా (తెలంగాణ)లో వుంది. రేకపల్లి లక్ష్మణరావు కుమారుడు రేకపల్లి సురేష్ (తెలగ కాపు) (కశ్యపగోత్రం) గారి కుటుంబాలు "రాజోలు" తూర్పుగోదావరి జిల్లాలో వందల కుటుంబాలు ఉన్నాయి. కాట్రేనిపాడు, మెరకపాలం, కరవక, శంకరగుప్త, రామరాజు, లంకగ్రామాలలో రేకపల్లి వారి మెరకలున్నాయి. రాజోలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 30 ఇండ్లు ఉన్నాయి.

శాసనములు : అనితల్లి కలువచేరు శాసనము మరియు మహమ్మదీయ చరిత్రకారుల వ్రాతలు, 13వ శతాబ్దములో హంపి, విద్యారణ్యస్వామి రచించిన "విద్యారణ్య శిక్ష" ప్రోలయ నాయకుని విలస శాసనము, కాపయ్య నాయకుని పోలవరం శాసనము, చోడభక్తిరాజు "పెంటపాడు" శాసనం ఆధారంగా.

చదవడం కొనసాగించండి

Musunuri Nayakas

musunuri nayakulu | musunuri nayakas | musunuri kapaya nayaka | Manuma Kulamu | Araveeti Clan | Tuluva Clan